సూర్యం బాబాయ్
ఉదయాస్త మానాల ఉనకి నిచ్చే సూర్యుణ్ణికీ (నేను సూర్యం బాబాయి అని యిష్టంగా పిల్చుకొంటా) సంబంధించిన పండగ నేడు.
సూర్యుణ్ణి మనమే కాదు విశ్వంలో చాలా దేశాలు స్మరించుకొన్నట్లు చరిత్ర చెబుతుంది. ఈజిప్షియన్ లు సూర్యుణ్ణి "రా' అని పూజించేవారట! జపనీయులు కూడా సూర్యోపాసన చేసేవారట.
భగవంతుడు ఎక్కడా వెదకనక్కరలేదు.తలెత్తి చూస్తే చాలు నేనున్నాని పలకరిస్తాడు. అందుకే "అసౌ ఆదిత్యో బ్రహ్మ" అని మనం సూర్యునికి దండం పెడుతుంటాము..అదిగదిగో ఆ ఆదిత్యుడే బ్రహ్మ. మనసు పులకరించే వేదమాత మనకు ఇచ్చింది.
నా విద్యార్థులకు అమ్మ నాన్న ఆదిత్యుడు మనకు కనిపించే దేవుళ్ళ రా! అని చెపుతుంటాను.
సూర్యుడు కేవలం వెలుగు వేడిమే కాదు సర్వం మనకు ఇస్తున్నాడు.అతడు లేకపోతే ఏమిలేదు.సర్వం శూన్యం.ఊహించలేము.ఆధునిక విజ్ఞానశాస్త్రమైన మన ఆధ్యాత్మ విద్య యైన.
సూర్యునకు ఉన్న ప్రతి పేరూ గొప్ప ఆర్థమిస్తుఃది.
అన్నిటికన్నా అందమైన పేరు "మిత్రుడు" మంచి సూర్యుడంటే ఆశ, ఉత్సాహము,సంతోషము ,ఒక భరోసా, నమ్మకము. రేపొకటి వుందని గురుతు చేసే ఆత్మీయత, నిరాశ వద్దని చెప్పె ఆశాకిరణం.మబ్బులు కమ్ముకున్నాయని క్రుంగి పోకు ,మబ్బులు చీల్చుకొని వెలుగు వస్తుందని ఓ దార్పు.
" మేము గొప్ప మాసామ్రాజ్యం గొప్ప, అందుకే మా రాజ్యం రవి అస్తమించని రాజ్యం " అని జాత్యాహంకారముతో విర్రవీగాడు ఆంగ్లేయాధికారి సర్దార్ వల్లభాయిపటేల్ తో.
అందుకు పటేల్ "అవును నిజం ! నేను ప్రాకాశిస్తుండగానే ఇంత దోపిడీ చేశారు మీరు. నేను అస్తమించే ఇంకెంత దోపిడీ చేస్తారో? అని భయపడి అస్తమించడం మానేశి వుంటాడని చమత్కరించాడు.
ఉదయాద్రి పైనుంచి ఉదయించి పశ్చిమాద్రి చేరేవరకు అస్తమించని భానుడే బాసట.
బాల్యంలో అంజనీ సుతుడు సూర్యబింబాన్ని బాగా మ్రగ్గిన పండుగా భావించి సూర్యని మ్రింగడానికి ప్రయత్నించిన కథ మనకు తెలుసు. అటుతరువాత హనుమంతుని శిష్యునిగా స్వీకరించి నవవ్యాకరణ పండితునిగా తీర్చిదిద్దాడట సూర్యుడు. నేను నిరంతర సంచారిని నీకెట్లు చదువు నేర్పగలని అన్న సూర్యుని ఒప్పించి విద్యనేర్చుకొన్నాడట ఎలా? అంటే ఉదయాద్రిపై ఒక కాలూ,పశ్చిమాద్రిపై మరోకాలు వుంచి సూర్యగమనమనుసరించి తలను వుంచి విద్యనేర్చుకొన్నట్లు యైతిహ్యం
యాజ్ఞ వల్కునికి యజుర్వేదమును సూర్యడే నేర్పాడు. ఆవేదానికి శుక్లయజుర్వేదం అనే పేరొచ్చింది. విద్యా గురువు కూడా! ఆరోగ్య ప్రదాత మన ఆదిత్యుడు. "ఆరోగ్యం భాస్కరాదీఛ్ఛేత్" అని వుండనే వుంది. ఈ విషయం ఆధునిక వైద్య శాస్త్రం కూడా ముక్త కంఠంతో అంగీకరించినది. మన సంస్కృత కవి మయూరుడు తనకు శాపవశాత్తు సంక్రమించిన చర్మవ్యాధిని సూర్యశతకం వ్రాసి నయం చేసుకొన్నాడు.సంస్కృత సాహిత్యంలో మయూర శతకం అనర్ఘ్యమైన రచన స్రగ్ధరా వృత్తాలతో సాగుతుంది.
మన తెలుగు సాహిత్యంలో మారద వెంకయ్య భాస్కర శతకం సుప్రసిధ్ధం.అతని సూర్యభక్తిని గురించి వివరాలు తెలియవు.మరింకెందరో సూర్యభగవానుని భక్త కవులు వున్నారో!
సూర్యుని చూచికాని భోజనం చేయని నియమం వున్నవారిని మనం చూడవచ్చు. వర్ష రుతువులో సూర్యుని చూడడానికి ఎదురు చూస్తున్న విషయం ఆముక్త మాల్యదలో కృష్ణరాయలు అందంగా వర్ణించాడు."రవిజూచి కుడుచువారలకు కృకలాసములకు నింగిని దృష్టినిలిచె" అంటారు. సూర్యుని చూడని రోజును దుర్దిదనమని అంటారు. జ్యోతిశాస్త్రం ప్రకారం సూర్యుడు పితృకారకుడంటారు. అంటే మనకు సూర్యుడు తండ్రి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి