ఇది దంపతులు
ఆదిదంపుతులిట్లునరుదెంచినారోయి
వాగర్థములరీతి వరములొసగ
బాలేందుధరుడిట్లు పార్వతీమాత తో
కైలాసగిరినుండి కదలివచ్చి
విజ్ఞాన శాస్త్రాల వివరాల వర్ణించి
మానవ ధర్మాన్ని మనకు తెలిపి
జ్ఞాన భిక్షనొసగకదలివచ్చిరిపుడు
వ్రతకథలెల్లను వరణీయమౌరీతి
పుణ్యాలరాశిని భువికి నొసగ
అందించినారయ్య యాదరాన
పార్వతమ్మ తల్లి పాలించుచుండగా
కొరత యేమి కలుగు కువలయాన
భవుని భక్తులెల్ల బంధుజనులుకాగ
కొరుతయేమి కలుగు కువలయాన
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి