సప్తతి ఉత్సవము

నా బావమరిది సప్తతి ఉత్సవ సందర్భంగా రాసిన పద్యరత్నాలు
-----------------+++++------
శేషాద్రి నిలుపుతాడు శ్రేయస్సు కూర్చ
వృషభధ్వజుడువరవృష్టినొసగ
భద్రాద్రి వారసుడు భధ్రంబు గూర్చి
సప్తతి యానంద సందోహమెదవె

తే.గీ.నేతివంశాబ్ది చంద్రుండు నీతిశాలి
మారురూపానయున్నట్టి మంచితనము
పరుల మేలుకై తపియించు మంచి మనసు
బావమరదియైనాడింక భాగ్యమట్లు

మగనిమనసునెరిగి మసలుభార్యకలుగ
తండ్రి మనసునెరగు తనయుదుండ
అన్నమనసునెరుగునాడచులుండ
మమతలల్లుకొనును మందిరాన

కౌండిన్యగోత్రాన ఘనడితడనుచు
పాండురంగసుజను పలుమారు పొగడ
కాంఠిన్యమెరుగని కోమలత్వంబు
నీదుసొంతమనుచు బుధులెల్ల పోగడ
కనకమహాలక్ష్మి కురుపించు పసిడి
సీతమ్మనీకిచ్చు యెంతేని సిరులు
బాలమ్మ వర్షించు భాగ్యంపురాశి
లక్ష్మి కుమారియె రత్నరాసులును

పరమకళ్యాన గరిభతో భాగ్యమబ్బ
శ్రీహరిని కూడి శర్వాణి సిరుల నొసంగు
హనుమస్రవంతియే యానంద మొసగ
సంతసమ్ముకనుమోయి సారమతివి

అమ్మయునాన్నయునాశ్వరదింప
కుతుళ్ళుకోడలు కూర్మితో మెరుగ
చెల్లెండ్లునలువురు చెలిమితో నుండి
కృత్యాలు లేనట్టి వియ్యాల వారు
ఆనందమొందుతు నాశిస్సులొసగ
మహినిమోహనశ్రీయుతంబాయె

మార్తి వారిబాల పాండురంగనిగూడి
ఇంధ్రధనువుబోలు నింటియందు
చైత్రమాసమట్లు చైతన్యమొప్నగా
కలలుపండునీకు నిలనునేడు
&&&&&&&&&&&&&&&&&&-
(అభినందనలతో మీ సీతా  నాగరాజ శాస్త్రి దంపతులు)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత